
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాజారం, కొత్తపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణలు శుక్రవారం ప్రారంభించారు. నూతన గృహాల్లోకి అడుగుపెట్టిన లబ్ధిదారులతో వారు సంతోషాన్ని పంచుకున్నారు.

















