
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని సారంగాపూర్ మండల కేంద్రంలో సర్పంచ్ కూనేరు భూమన్న ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ వంటి సంక్షేమ పథకాలతో ప్రజలకు చేసిన సేవలను ఆయన స్మరించుకున్నారు.



















