
గోమాత ఆరాధన ఉద్యమ ఆహ్వానం కార్యక్రమం ఆధ్వర్యంలో, గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, గోసేవా మంత్రత్వ శాఖను ఏర్పాటు చేయాలని, గోవధ నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ క్రమంలో మంచిర్యాలలో సేకరించిన సంతకాల పత్రాలను తహసీల్దార్ రాఫాతుళ్ళ హుసేన్ కు అందజేశారు.



















