
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, మందమర్రి పట్టణంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి, అమరవీరులకు నివాళులర్పించారు. అయితే, అమరవీరుల స్తూపానికి సుందరీకరణ చేయకపోవడంపై పార్టీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.



















