
నకిలీ పత్తి విత్తనాల సరఫరా, వినియోగాన్ని అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు. బుధవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ దిశగా పలు సూచనలు చేశారు.



















