నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలో మద్యానికి బానిసైన ఓ యువకుడు పురుగుల మందు తాగి మృతి చెందాడు. ఆర్థిక ఇబ్బందులతో పాటు మద్యపానానికి బానిసైన రాథోడ్ లక్ష్మణ్ (29) ఈ ఘోరానికి పాల్పడ్డాడు.
సారంగాపూర్ మండలం సాయినగర్ తండాకు చెందిన రాథోడ్ లక్ష్మణ్, గత కొద్ది నెలలుగా మద్యానికి తీవ్రంగా బానిసయ్యాడు. దీనితో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా అతన్ని వెంటాడుతున్నాయని సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
మంగళవారం రాత్రి, ఇంట్లో కుటుంబ సభ్యులు లేని సమయంలో, మద్యం మత్తులో పురుగుల మందును సేవించాడు. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి, 108 అంబులెన్స్ సహాయంతో నిర్మల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.






