అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 17
చెన్నూరు నియోజకవర్గంలో సింగరేణి కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. కోల్ బ్లాక్ ఏర్పాటు, గృహాలు, భూముల వినియోగంతో పాటు, ఉత్తర వాహిని పుణ్యస్థానం అభివృద్ధికి ప్రధాని మోడీని ఆహ్వానించే యత్నాలు కూడా బీజేపీ వ్యూహాల్లో భాగంగా ఉన్నాయి.
చెన్నూరు నియోజకవర్గ పరిధిలో సింగరేణి కార్యకలాపాలను విస్తృతం చేసేందుకు బీజేపీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే కోల్ బ్లాక్ ఏర్పాటు, 2 వేల క్వార్టర్ల వినియోగం, భూములు, గృహాల వాడకం వంటి ప్రతిపాదనలు ప్రధాన ఎజెండాగా ఉన్నాయి. సోమనపల్లి సింగరేణి కోల్ బ్లాక్ దీనికి కీలకం కానుంది.
ఉత్తర వాహిని పుణ్యస్థానం అభివృద్ధికి ప్రధాని మోడీ ఆహ్వానించే యత్నాలు కూడా బీజేపీ వ్యూహాల్లో భాగంగా ఉన్నాయి. కమలం పార్టీని నియోజకవర్గంలో వికసించేలా పక్కా పథకాలతో ముందుకు సాగుతున్నారు. చెన్నూరు అసెంబ్లీ స్థానంపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ పోటీ అభ్యర్థి దుర్గం అశోక్ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు.












