
మంచిర్యాల జిల్లా మందమర్రి మండలంలో నిర్వహించిన ఓటర్ల ప్రత్యేక సవరణ జాబితా (SIR)పై బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) అవగాహన శిక్షణ కార్యక్రమంలో కార్మిక, మైనింగ్ & ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వివేక్, SIR ముసుగులో బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అనుకూల ఓటర్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు.
















