
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి ఇటీవల జర్మనీ దేశంలో ఏడు రోజుల పర్యటనను ముగించుకుని వచ్చారు. ఈ పర్యటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జర్మనీ నుండి ఆశించిన స్థాయిలో పెట్టుబడులు రాకపోవచ్చని, అక్కడ సెంటర్లు ఏర్పాటు చేసే అవకాశాలు తక్కువని తెలిపారు. ఉద్యోగాల కల్పనపై ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు.


















