
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హమాలివాడ కట్ట పోచమ్మ ఆలయంలో బోనాల పండుగను కన్నుల పండువగా నిర్వహించారు. నల్ల కోటమ్మ లక్ష్మయ్య ట్రస్ట్ చైర్మన్, మాజీ మున్సిపల్ చైర్మన్, 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ ట్రస్టు ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.



















