
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి భారతీయ జనతా పార్టీ (బీజేపీ)తోనే సాధ్యమని, ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి దిక్సూచిగా నిలుస్తున్నారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు అన్నారు. మే 10న హైదరాబాద్లో జరిగే ప్రధాని మోడీ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.


















