
ఎల్కతుర్తి మండలం, జగన్నాథపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెండ్యాల తిరుపతి, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాను పార్టీలో చేరినట్లు తిరుపతి తెలిపారు.



















