
జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి విస్తృతంగా పర్యటిస్తామని, నాయకుల్లో ఉత్తేజాన్ని కలిగిస్తామని మంచిర్యాల డిసిసి అధ్యక్షులు పిన్నింటి రఘునాథ్ రెడ్డి తెలిపారు. నూతన బాధ్యతలు చేపట్టిన వారికి వారి కర్తవ్యాన్ని నిర్దేశిస్తామని ఆయన పేర్కొన్నారు.

















