
చెన్నూర్ నియోజకవర్గంలోని ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. మందమర్రిలో జరిగిన అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలోని మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సంక్షేమంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.



















