
రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో కీలక పదవుల భర్తీకి పార్టీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో భాగంగా, కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు, జిల్లా డీసీసీలలో వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రెటరీల వంటి 70 పోస్టుల భర్తీకి జాబితా సిద్ధం చేసినట్లు సమాచారం.


















