మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 14
గతఎనననవైఫెదడవూడసథనవదనధనదశఎనగదృషణూతఅనన.నషటఉధషఘనథ,అధషడనగనూవెటశవగౌడైసనఆణనఖడసతూఏటసనవసవశఆనటడ.
గత ఎన్నికల్లో పాలనలో వైఫల్యం చెందడం వల్లే మంచిర్యాలలో బి ఆర్ ఎస్ కు మూడో స్థానం వచ్చిందని బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎనగందుల కృష్ణ మూర్తి అన్నారు. నాయకులు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్, జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లపై చేసిన ఆరోపణలను ఖండిస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
నాయకులు అవగాహన రాహిత్యంతో, తమ ఉనికి చాటుకోవడానికి బీజేపీపై తప్పుడు, అనాలోచిత వాక్యాలు చేయడం సరికాదని కృష్ణ మూర్తి అన్నారు. బీజేపీ ఒక క్రమశిక్షణ, సిద్ధాంతపరమైన పార్టీ అని, తమ నాయకుల గురించి మాట్లాడే నైతిక హక్కు కు లేదని ఆయన అన్నారు. అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధమని, అంత అభివృద్ధి చేసి ఉంటేనే ప్రజలు ఎన్నికల్లో మూడో స్థానానికి నెట్టారని ఎద్దేవా చేశారు.
నాయకులు చెప్పుకుంటున్న అభివృద్ధిలో భాగంగానే మాతా శిశు ఆసుపత్రి ఇప్పటికీ గర్భిణీ స్త్రీలకు ఇబ్బందులు కలిగిస్తోందని, మంచిర్యాల కూగలిలోని ఐలాండ్స్ ను ఎందుకు కూల్చి వేశారో అందరికీ తెలుసని అన్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నాయకులు ఏడాది పాటు కనిపించలేదని, కానీ బీజేపీ నాయకులు రఘునాథ్ వీరబల్లి గారు గెలుపోటములను సహజంగా స్వీకరిస్తూ, అధికారం ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలుస్తూ, వారి సమస్యలను పరిష్కరిస్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ, సేవా కార్యక్రమాలు చేస్తున్నారని తెలిపారు.
సమాచారం తెలియకపోతే కనీసం రోజువారీ వార్తాపత్రికలైనా చూసి, తెలుసుకుని హుందాగా మాట్లాడటం నేర్చుకోవాలని సూచించారు. ఏ కార్యకర్తకైనా ఇబ్బంది వస్తే పార్టీలతో సంబంధం లేకుండా రఘునాథ్ గారు స్వయంగా న్యాయం జరిగే వరకు పోరాడుతారని, అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని అన్నారు. భారతీయ జనతా పార్టీలో పదవులు రికమండేషన్ల మీద రావని, తండ్రి తర్వాత కొడుకు, కొడుకు తర్వాత కూతురు అనే పద్ధతి ఇక్కడ లేదని స్పష్టం చేశారు. జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ చిన్నతనం నుంచే బీజేపీ సిద్ధాంతాలతో పనిచేస్తూ ఎదిగిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తి గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు.
మీరు ఎక్కడ చెబితే అక్కడ చర్చకు సిద్ధమని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. తాము హిందువులమని, హిందుత్వమే తమ ఎజెండా అని, జాతిని ఒకతాటిపై నడిపేది తామేనని, మత రాజకీయాలు కాదని, అందరినీ కలుపుకొని పోవడమే తమ ఎజెండా అని కృష్ణ మూర్తి అన్నారు.











