మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 11
మంచిర్యాల హైటెక్ సిటీలోని 52వ డిమాండ్విజన్లో వీధి కుక్కల దాడిమాండ్లో తీవ్రంగా గాయపడిమాండ్న సుదీక్ష అనే బాలికకు ప్రభుత్వ సహాయం అందించాలని బీజేపీడిమాండ్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ డిమాండ్మాండ్ చేశారు. ఇప్పటికే వైద్య ఖర్చులు 3 లక్షలు దాటాయని తెలిపారు.
మంచిర్యాల హైటెక్ సిటీలోని 52వ డివిజన్లో ఇటీవల వీధి కుక్కలు దాడి చేయడంతో సుదీక్ష అనే బాలిక తీవ్రంగా గాయపడింది. సురం రాములు కుమార్తె అయిన సుదీక్షపై కుక్కలు చుట్టుముట్టి దాడి చేశాయి. వెంటనే ఆమెను కరీంనగర్కు తరలించగా, పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.
వైద్య ఖర్చులు 3 లక్షలు దాటాయి
సుదీక్ష చికిత్సకు ఇప్పటికే దాదాపు 3 లక్షల రూపాయలు ఖర్చయినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో, ప్రభుత్వపరంగా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని బీజేపీ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ డిమాండ్ చేశారు.
కుటుంబానికి 5 లక్షల సాయం
కుటుంబంతో ఫోన్లో మాట్లాడి వివరాలు సేకరించిన ముఖేష్ గౌడ్, ఈ ప్రమాదం మంచిర్యాలలో జరిగినందున, బాధితురాలి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని కోరారు. సుదీక్ష ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పాలకవర్గంపై ఉందని ఆయన హెచ్చరించారు.












