మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 13
ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ మంచిర్యాలలో అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా మంచిర్యాలలో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మంచిఅవయవ దానం ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు కరపత్రాలు, వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి అవయవ దానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి, మరణానంతరం కూడా అవయవాలను దానం చేయడం ద్వారా ఇతరులకు పునర్జన్మను ఇవ్వవచ్చని అవగాహన కల్పించడానికి ఈ దినోత్సవం దోహదపడుతుంది.
కరపత్రాల విడుదల
ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో, ప్రోగ్రాం చైర్మన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి నేతృత్వంలో ప్రజలకు అవయవ దానంపై అవగాహన కల్పించేందుకు కరపత్రాలను, వాల్ పోస్టర్లను విడుదల చేశారు.
అవయవ దానం మహా దానం
ఈ సందర్భంగా లయన్ వి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, అవయవ దానం మహా దానం అని అన్నారు. వ్యక్తి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత లేదా సహజ మరణం సమయంలో గుండె, కాలేయం, కిడ్నీలు, ఊపిరితిత్తులు, క్లోమం, కార్నియాలు వంటి అవయవాలను దానం చేయడం ద్వారా సుమారు 8 మంది వరకు ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. అవయవ దానంపై ప్రజల్లో ఉండే అపోహలను తొలగించి, ప్రాణాలను నిలపడంలో దాని గొప్పతనాన్ని చాటడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమని ఆయన తెలియపరిచారు. కావున మనిషి చనిపోయిన తర్వాత అవయవ దానానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ వి మధుసూదన్ రెడ్డి, సీనియర్ లయన్ సభ్యులు లయన్ ఎం రామాంజనేయులు, లయన్ ఎస్ నాగేందర్, లయన్ డేగ బాబు, లయన్ ఎడ్ల కిషన్ తదితరులు పాల్గొన్నారు.












