Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 18
హాజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వరి ధాన్యం శుభ్రం చేసేందుకు ప్రభుత్వం అందించిన విలువైన యంత్రం అధికారుల నిర్లక్ష్యంతో ఎండకు, వానకు గురవుతోంది. కనీసం నీడ లేని చోట ఉంచడంతో యంత్రం తుప్పు పట్టిపోతోంది.
హాజీపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో వరి ధాన్యం శుభ్రం చేయడానికి ప్రభుత్వం అందించిన విలువైన యంత్రం నిర్లక్ష్యానికి గురవుతోంది. పాఠశాల మైదానంలో కనీసం నీడ కూడా లేని చోట ఈ యంత్రాన్ని ఉంచడంతో, అది ఎండకు, వానకు తడుస్తూ తుప్పు పట్టిపోతోంది.
సంబంధిత అధికారులు స్పందించి, ఈ యంత్రాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించాలని రైతులు కోరుతున్నారు.











