మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 10
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు మెచ్చే పాలన అందించి, కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని, అభివృద్ధి, సంక్షేమంలో మంచిర్యాల ముందు వరుసలో నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఇందులో భాగంగానే, చదువుకునే విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతులను మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పారు.
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజలు మెచ్చే పాలన అందించి, కాంగ్రెస్ను మళ్లీ అధికారంలోకి తీసుకువస్తామని, అభివృద్ధి, సంక్షేమంలో మంచిర్యాల ముందు వరుసలో నిలుస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. ఇందులో భాగంగానే, చదువుకునే విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలలు, సంస్థలలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతులను మంచిర్యాల జిల్లా కేంద్రం నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పారు. ట్రయల్ రన్ను మంచిర్యాల నుంచి ప్రారంభించి, ఆ తర్వాత చెన్నూర్కు సరఫరా ఉంటుందన్నారు.
విద్యార్థులకు ఉచిత శిక్షణ
మరోవైపు, హరే రామ హరే కృష్ణ సంస్థ ద్వారా కూడా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, శాకాహారాన్ని అందించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ అవకాశాల కోసం 7 వేల నోటిఫికేషన్కు సంబంధించి, వారికి ఉచిత శిక్షణ, సామగ్రి, మధ్యాహ్న భోజనంతో కూడిన శిక్షణా కార్యక్రమాలను మంచిర్యాలలోని టీటీడీ కేంద్రంగా, కొక్కిరాల రఘుపతిరావు ట్రస్టు ద్వారా ఏర్పాటు చేస్తున్నామన్నారు. శరత్ పర్యవేక్షణలో, తెలంగాణలో అత్యుత్తమ ట్రైనర్ల నేతృత్వంలో విద్యార్థులకు శిక్షణ తరగతులు ఉంటాయని, ఆసక్తిగలవారు ఈనెల 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, ఆ తర్వాత 20 నుంచి శిక్షణా కేంద్రం ప్రారంభించే చర్యలు మొదలవుతాయని చెప్పారు.
ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు
విద్యార్థుల అల్పాహారం, భోజనం కొడంగల్, మధిర తర్వాత మంచిర్యాల, మంతనీలలో ప్రారంభమవుతాయని, సీఎం, డిప్యూటీ సీఎం తనకు ఇస్తున్న ప్రాధాన్యతను మరిచిపోలేనని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్లపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కడెం ప్రాజెక్టు నీటి విడుదల కోసం నెల రోజుల కిందటే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేయడం ప్రతిపక్షాల అజ్ఞానాన్ని చాటుతోందని దుయ్యబట్టారు. 0.4 డెడ్ స్టోరేజ్లో నీరు ఉండాలని, ఆ మాత్రం తెలియని ప్రతిపక్షాలు మంచిర్యాలలో ఉండటం ప్రజల దౌర్భాగ్యమని అన్నారు.
అభివృద్ధిపైనే దృష్టి
ప్రతిపక్షాల ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోకుండా, ప్రజల అభివృద్ధి, సంక్షేమంపైనే తమ దృష్టి ఉంటుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. వర్గాలు, గ్రూపులుగా విడిపోయి చేసే అసత్య ఆరోపణలు, వ్యాఖ్యలను ప్రజలు నమ్మవద్దని, 53 మంది కార్పొరేటర్లు పూర్తిస్థాయిలో అభివృద్ధిలో పాలుపంచుకుంటారని వెల్లడించారు.
మీడియా సమావేశం వివరాలు
ఈ మీడియా సమావేశం ఎమ్మెల్యే నివాసంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ, మేయర్ మధుకర్, డిప్యూటీ మేయర్ రమ్య, సిటీ అధ్యక్షుడు తుమ్ముల నరేష్, కార్పొరేటర్లు పాల్గొన్నారు.










