ప్రపంచ నేత్రదాన దినోత్సవం సందర్భంగా, మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో నేత్రదానం పై అవగాహన సదస్సు నిర్వహించబడింది.
ఈ కార్యక్రమం లైన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ కోఆర్డినేటర్ ఫర్ ఐ క్యాంప్ లయన్ వి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.
ముఖ్య అతిథులుగా డిసిపి శ్రీ A భాస్కర్, ఏ సి పి ఆర్ ప్రకాష్, సీఐ ప్రమోద్ రావు, ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ భీష్మ, డాక్టర్ శ్రీధర్, ప్రొఫెసర్ డాక్టర్ గీతాంజలి పాల్గొన్నారు.
సదస్సులో, నేత్రదానం యొక్క ప్రాముఖ్యత గురించి వివరణలు ఇచ్చారు. నేత్రాలు సేకరించడానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన సమాచారం కూడా అందించారు.
పొన్నం కుమార్ వారి సతీమణి అరుణ, మరణానంతర నేత్రదానానికి అంగీకారాన్ని ప్రకటించారు.












