
రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో, వాతావరణ శాఖ మరియు పౌర రక్షణ విభాగం ప్రజలందరికీ అత్యవసర హెచ్చరికలు జారీ చేశాయి. ఏప్రిల్ 19 నుండి మే 31 వరకు, మధ్యాహ్నం వేళల్లో బయట తిరగడం ప్రమాదకరమని, ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.



















