మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 05
మంచిర్యాలలో ర్యాల పట్టణ ప్రజలకు మంచిఉచిత కంటి వైద్య సేవలను అందించేందుకు లైన్స్ క్లబ్ మంచిర్యాల, లైన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా ఒక ప్రత్యేక శిబిరాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ నెల 8వ తేదీన జరగనున్న ఈ శిబిరంలో కంటి పరీక్షలతో పాటు, అవసరమైన వారికి మంచిఉచిత శస్త్రచికిత్సలు కూడా అందుబాటులో ఉంటాయి.
మంచిర్యాల పట్టణంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నట్లు లైన్స్ క్లబ్ మంచిర్యాల మరియు లైన్స్ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్తంగా ప్రకటించాయి. ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు సున్నం బట్టి వాడలోని లైన్స్ భవన్ ప్రాంగణంలో ఉచిత కంటి శాస్త్ర చికిత్స నిర్ధారణ శిబిరం ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు.
శిబిరం వివరాలు
ఈ కార్యక్రమ ప్రోగ్రాం ఆర్గనైజర్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ డాక్టర్ సుగుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. శిబిరంలో 50 సంవత్సరాలు పైబడిన మహిళలు, పురుషులు, కంటి జబ్బులతో బాధపడుతున్నవారు, కంటిపై పొరలు (శుక్లాలు) ఉన్నవారు పాల్గొనవచ్చని తెలిపారు.
ఉచిత శస్త్రచికిత్సల ఏర్పాటు
శిబిరంలో పాల్గొన్నవారిని మంచిర్యాల పట్టణ ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ అభిషేక్ క్షుణ్ణంగా పరీక్షిస్తారు. కంటిలో శుక్లాలు ఏర్పడినట్లు నిర్ధారణ అయితే, వారిని ఈ నెల 19వ తేదీన లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని రేకుర్తి ఐ హాస్పిటల్కు ఉచితంగా అన్ని వసతులతో పంపించి, ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు తెలియపరిచారు.
కరపత్రాల విడుదల
ఈ కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు లయన్ డాక్టర్ నరేష్, జోన్ చైర్ పర్సన్ లైన్ దొంతుల ముఖేష్, గోల్డెన్ జూబ్లీ సెక్రటరీ లయన్ డాక్టర్ వేణు, లయన్ ఎం. వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.











