మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 21
మచయ అసెబీ నయోకవ ధ ో కెస కీయు సవ సుుననయ. వ ోుకు ను సధమవుూ, మ బనన ెచుకుటూ భవషయు ణళకో ముుకు స యోచనో ఉనను. ఈ కీయ ణమీో మ వవక, ఎీ వశీ కీక ోషసునను.
మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వర్గ పోరుకు నేతలు సిద్ధమవుతున్నారు. తమ బలాన్ని పెంచుకుంటూ భవిష్యత్తు ప్రణాళికతో ముందుకు సాగే యోచనలో ఉన్నారు. ఈ రాజకీయ క్రీడకు మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఎంపైర్లుగా వ్యవహరిస్తుండగా, మంతెన జగన్మోహన్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య బౌలర్లుగా కొనసాగుతున్నారు.
కార్పొరేషన్, వార్డుల్లో చేరికలు
మంచిర్యాల కార్పొరేషన్ లో కాంగ్రెస్ కు 44 స్థానాలు రాగా, చేరికలతో మొత్తం 53 కి చేరింది. ప్రస్తుతం 3 కార్పొరేటర్లు, 47 డివిజన్ లో వెంకట సాయి కృష్ణ, 26వ డివిజన్ లో ఇరగ దిండ్ల రవి, 36వ డివిజన్ లో అగల్ డ్యూటీ రాణి రాజు మంత్రి వివేక్, ఎంపీ వర్గంలో చేరారు. లక్సెట్టిపేట లో 9 స్థానాలు రాగా , 7వ వార్డు కౌన్సిలర్ బోడరాజు, 9వ వార్డు వడ్డేపల్లి రాజలింగు, 13వ వార్డు బిరుదుల సత్యనారాయణ, సీనియర్ రంజిత్ సింగ్ ఈ వర్గంలోకి చేరారు.
దండేపల్లిలోనూ చేరికలు
దండేపల్లిలో సైతం ప్రజా ప్రతినిధులు, మాజీ నేతలు ఈ వర్గంలోకి చేరారు. మంచిర్యాలలో కాంగ్రెస్ ను పూర్తిస్థాయిలో బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల నాటికి పోరుకు సిద్ధం చేస్తామని మంత్రి వివేక్, ఎంపీ వంశీ వర్గంలో చేరిన నేతలు తెలిపినట్లు సమాచారం.












