సంగారెడ్డి, 2026-08-11
ప్రతి కేసులోనూ నాణ్యమైన దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, పెండింగ్ కేసుల పరిష్కారం, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.
ప్రతి కేసులోనూ నాణ్యమైన దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేయాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన, పెండింగ్ కేసుల పరిష్కారం, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్, రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజా భద్రత, కమ్యూనిటీ పోలీసింగ్ వంటి అంశాలపై కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వివిధ పోలీస్ స్టేషన్లలో దర్యాప్తులో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల పురోగతిని ఎస్పీ సమీక్షించారు. లాంగ్ పెండింగ్ కేసులు, మిస్సింగ్ కేసుల ఛేదన, ఎన్బీడబ్ల్యూ ఎగ్జిక్యూషన్కు ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకుని, నిర్ణీత గడువులోగా దర్యాప్తును పూర్తి చేయాలని సూచించారు. గ్రేవ్ కేసుల్లో శాస్త్రీయ ఆధారాలను సేకరించి, నిందితులకు న్యాయస్థానంలో శిక్ష పడేలా సమర్థవంతంగా దర్యాప్తు చేపట్టాలని అన్నారు. నిజమైన దోషులకు న్యాయస్థానంలో శిక్ష పడినప్పుడే ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరింత పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు అధికంగా ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి, ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయించాలని అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఆదేశించారు.
శాంతిభద్రతల పరిరక్షణలో గ్రామ స్థాయిలో సమాచార సేకరణ అత్యంత కీలకమని ఎస్పీ పేర్కొన్నారు. ప్రజల నుంచి సమాచారాన్ని సేకరించి, నేరాలను అరికట్టడంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలను విస్తృతం చేసి, ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, ప్రభాకర్, సురేందర్ రెడ్డి, ఏఆర్ డీఎస్పీ నరేందర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఎస్బీ ఇన్స్పెక్టర్ సదా నాగరాజు, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు సురేష్, రాజశేఖర్ రెడ్డి, సబ్ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.











