మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 19
మంచిర్యాల కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖసుభిక్షంసురక్షంకాళీమాతచల్లనిచూపుమంచిర్యాలకుఉండాలినల్లశంకర్ఫలహారబండిశోభయాత్రఅద్భుతంమంచిర్యాల జిల్లా కేంద్రంలో 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాసం నుండి కాళీమాత ఫలహార బండి ఊరేగింపు అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ పాల్గొని, శోభయాత్ర మంచిర్యాలను ప్రారంభించారు. పోతరాజుల నృత్యాలు, శివపార్వతుల వేషాలు, డప్పు వాయిద్యాలు, మహిళల సందడితో ఈ ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది.
మంచిర్యాల జిల్లా కేంద్రంలో 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాసం నుండి కాళీమాత ఫలహార బండి ఊరేగింపు కన్నుల పండుగగా సాగింది. ఈ సందర్భంగా మంచిర్యాల కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షురాలు సురేఖ శోభయాత్రను ప్రారంభించి, కాళీమాత చల్లని చూపు మంచిర్యాలకు ఉండాలని ఆకాంక్షించారు. నల్ల శంకర్ ఫలహార బండి శోభయాత్ర అద్భుతంగా జరిగిందని ఆమె కొనియాడారు.
పోతరాజుల నృత్యాలు, శివపార్వతుల వేషాలు, డప్పు వాయిద్యాలు, మహిళల సందడితో ఈ ఊరేగింపు ఆధ్యాంతం వైభవంగా ప్రారంభమైంది. గోపాల్ వాడ వద్ద బోనాలతో మహిళలు గాంధీనగర్ నుంచి కాళీమాత ఆలయం వరకు బోనాల జాతర నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రమ్య, కార్పొరేటర్లు, ఆలయ నిర్వాహకులు రఘు స్వామి, పెట్టం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.












