మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 16
మచిర్ాల ఎమ్మెల్ ్రమ్ సార్ రావు తీసుకున్న 444 కోట్ల రూాల అ్ుల బీజీ రాష్ట్రఉపాధ్యక్షులురఘునాథరావుతోముఖాముఖి ఉాధ్క్షులు రఘునాథరావుతోనాథరావు తీవ్ర విమర్శలు ు్ిచారు. ఈ అ్ులకు సబధిచిన లెక్కలను ్రజలకు అర్థమ్లా బహిరరచాలని ఆన డిమాడ్ చశారు. స్మార్ట్ రషన్ కార్డులవ్యయంపైప్లీజ్రియంబర్స్మెంట్చెల్లింపులపైబిజెపిరాష్ట్ర రుతో ్రభుత్వ 600 కోట్లు వృధా చసిదని కూడా ఆరోిచారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు 444 కోట్ల చెల్లింపు లెక్కలను బహిరంగ పరచాలని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథరావు డిమాండ్ చేశారు. సాయినాథ్ కంపెనీ నుంచి 357 కోట్లు సేకరించినట్లు తమ వద్ద సమాచారం ఉందని, అయితే మరో కంపెనీ లెక్కలు చూడలేదని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే తీసుకున్న మొత్తం అప్పు 444 కోట్లుగా వెబ్సైట్లలో ఉందని, ఇందులో 105 కోట్ల రుణం, 90 కోట్ల వడ్డీతో కలిపి 195 కోట్ల లెక్కలు ఎక్కడినుంచి వచ్చాయో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని ఆయన అన్నారు.
కాంగ్రెస్ నాయకత్వంపై విమర్శలు
కాంగ్రెస్ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలు కూడా ఎమ్మెల్యే సంపాదనపై ప్రశ్నలు గుప్పిస్తున్నాయని రఘునాథరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యే చెప్పినట్లుగా, అప్పటికే దివాళీ తీసినట్లుగా ప్రకటించబడి, బ్యాంకులను డిఫాల్ట్ గా ముద్రపడిన తర్వాత కూడా కంపెనీలు రుణాలు ఇచ్చాయంటే ఆశ్చర్యంగా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రజ్యోతి, టైమ్స్ ఆఫ్ ఇండియాలో బహిరంగ ప్రకటనల ద్వారా డబ్బులు చెల్లించాలని వచ్చిన తదుపరి ఎమ్మెల్యే చెల్లింపులు, రుణం, వడ్డీ లెక్కలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని డిమాండ్ చేశారు.
స్మార్ట్ రేషన్ కార్డులపై విమర్శ
రాష్ట్ర ప్రభుత్వం 600 కోట్లతో స్మార్ట్ రేషన్ కార్డుల పేరుతో వృధా చేసిందని రఘునాథరావు విమర్శించారు. కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో లోగోతో ఇచ్చిన రేషన్ కార్డులను తెలంగాణ ప్రభుత్వం చూసి బుద్ధి తెచ్చుకోవాలని సూచించారు. రేషన్ బియ్యంలో 90 శాతం ఇచ్చే కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, మంత్రుల ఫోటోతో పాటుగా కార్డులపై పెట్టకపోవడం శోచనీయమన్నారు. లోగోతో ఇచ్చే కార్డుకు మంత్రుల ఫోటోలు పెట్టే క్రమంలో ప్రధాని ఫోటో పెట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్కు లేకపోవడం కుటీలనీతికి నిదర్శనమని అన్నారు.
ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు
గత ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని చెల్లించాలని, కేవలం రెండున్నర ఏళ్లకే పరిమితం చేస్తామనడం సరికాదని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని ఆయన అన్నారు.
బీజేపీ విజయంపై ధీమా
తెలంగాణలో కాషాయం గుబాళింపుతో పాటు మంచిర్యాలలో బిజెపి విజయం సాధిస్తుందని రఘునాథరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ వివరాలను ఆయన ఆదివారం అక్షరవేకువతో ముఖాముఖిగా చెప్పారు.












