
హాజీపూర్ మండలం, గుడి పేట గ్రామానికి చెందిన మున్సిపల్ పర్మనెంట్ కార్మికుడు చిప్పకుర్తి అంకుల్ అనారోగ్యంతో గురువారం రాత్రి మృతి చెందారు. శుక్రవారం ఆయన స్వగృహంలో అంత్యక్రియలకు ముందు, మంచిర్యాల్ మున్సిపల్ మేయర్ ధరణి మధుకర్, 17వ డివిజన్ కార్పొరేటర్ లగిశెట్టి రాజయ్యతో పాటు పలువురు అధికారులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.



















