Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 17
హాజీపూర్ మండలం వేంపల్లిలో ఆషాడ మాసం సందర్భంగా పెరిక సంఘం ఆధ్వర్యంలో గోరింటాకు పండుగను ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. మంచిర్యాల జిల్లా పెరిక సంఘం మహిళా అధ్యక్షురాలు అత్తే సరోజ నేతృత్వంలో మహిళలు సాంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొని, సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.
హాజీపూర్ మండలం వేంపల్లిలోని మంచిర్యాల గార్డెన్స్లో ఆషాడ మాసం గోరింటాకు పండుగను ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల జిల్లా పెరిక సంఘం మహిళా అధ్యక్షురాలు అత్తే సరోజ ఆధ్వర్యంలో మహిళలు గోరింటాకు వేడుకలను సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కందుల సంధ్యారాణి, జిల్లా అధ్యక్షుడు బొడ్డు శంకర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.












