ప్రభుత్వ నిర్వహణలో రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టిన అవగాహన కార్యక్రమం పోస్టర్లను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు విడుదల చేశారు. ఈ నెల 18 వరకు రోడ్డు భద్రతపై అధికారులు నిరంతర చర్యలు చేపడతారని తెలిపారు.
ప్రజా పాలన ప్రగతిలో భాగంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. కాలం చెల్లిన వాహనాలను ఉపయోగించకుండా, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రమాదాలకు దూరంగా ఉండేలా ట్రాఫిక్ నిబంధనలు, అధికారుల సూచనలు, సలహాలను పాటించాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు విడుదల చేసిన ఈ పోస్టర్లు ప్రజల్లో చైతన్యం తీసుకువస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.










