మంచిర్యాల (అక్షరవేకువ) సెప్టెంబర్ 14
మట్టి గణపతులను పూజించి ప్రకృతిని రక్షించాలని ఎమ్మెల్యే పిఎస్ ఆర్ మంచిర్యాల ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా ఆయన ఈ సందేశం ఇచ్చారు. పర్యావరణ హిత గణపతులను వాడాలని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులకు దూరంగా ఉండాలని సూచించారు.
మట్టి గణపతులను పూజిద్దాం ప్రకృతి రక్షణ చేద్దాం ఎమ్మెల్యే పిఎస్ ఆర్ స్పష్టం చేశారు. సోమవారం వినాయక చవితి సందర్భంగా మంచిర్యాల ప్రజలకు ఈ పిలుపునిచ్చారు. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో వాసవి మెడికల్ జనరల్ స్టోర్ వద్ద మట్టి వినాయకుల పంపిణీ చేశారు. దేవదేవుని కృపాకటాక్షాలు మంచిర్యాల ప్రజలపై ఉండాలని తాను కోరుతున్నట్లు చెప్పారు. అనంతరం బస్టాండ్ వద్ద కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మట్టి గణపతుల పంపిణీ పెద్ద ఎత్తున చేపట్టారు ఈ సందర్భంగా ప్రకృతిని రక్షిద్దాం దేవదేవుని పూజిద్దాం అన్న సూక్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకులను దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మేయర్ మధుకర్ వాసవి క్లబ్ నేతలు కొండా చంద్రశేఖర్ కొండ కార్తీక్ మాదేం శెట్టి సత్యనారాయణ చిలివేరి శ్రీనివాస్ కుమ్మరి సంఘం నేతలు తదితరులు పాల్గొన్నారు.



