మరియు (అక్షరవేకువ) సెప్టెంబర్ 06
లక్కీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో వైశ్య భవన్లో రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు, 50 మందికి పైగా ఉపాధ్యాయులకు గురు స్పూర్తి పురస్కారాల ప్రదానోత్సవం ప్రారంభమైంది. కార్పొరేటర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, పెంట రజిత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
లక్కీ ఈవెంట్స్ ఆధ్వర్యంలో వైశ్య భవన్లో రాష్ట్రస్థాయి సాంస్కృతిక పోటీలు, 50 మందికి పైగా ఉపాధ్యాయులకు గురు స్పూర్తి పురస్కారాల ప్రదానోత్సవం సందర్భంగా కార్పొరేటర్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు తూముల నరేష్, పెంట రజిత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. దోమల రమేష్ రంగస్థల పూజ నిర్వహించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఇది ఒక చక్కటి వేదిక అని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ పోటీలలో సుమారు 5 జిల్లాల నుంచి 300 మంది కళాకారులు పాల్గొనడం సంతోషదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అడ్డగూరి లక్ష్మణ్ లక్కీ, వేల్పుల రమేష్, హనుమండ్ల మధు, జిల్లా నృత్య కళా సమాఖ్య అధ్యక్షులు రాకం సంతోష్, గిరి నాని, విజయ్, నర్మదా, వసుధ, వనిత, భార్గవి తదితరులు పాల్గొన్నారు.











